వెంగళరావునగర్, జూన్ 25: అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ, శాలివాహన నగర్ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో నూతన వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఎమ్మెల్యే మాగంటి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వరద నీరు రోడ్ల పై నిలువకుండా అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తేస్తే వాటిని తక్షణమే పరిష్కరిస్తానని స్థానికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, నాయకులు తన్నుఖాన్, మధుయాదవ్, చిన్నబాబు, ఫయాజ్, రాణి, కవిత, కాలనీవాసులు మాగంటి వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు.