తుర్కయాంజాల్, జూన్ 9 : మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చైర్ పర్సన్ అనురాధరాంరెడ్డి అన్నారు. ఇంజాపూర్ 14వ వార్డులో రూ.11 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను, తాజాగా చేపట్టిన ఇంటింటి నల్లాలను వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరితధన్రాజ్ గౌడ్, కౌన్సిలర్ రవీందర్ రెడ్డితో కలిసి ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. దశల వారీగా వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పైప్లైన్, బీటీ రోడ్లను పూర్తి చేస్తామన్నారు. కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్స్ ఫ్లోర్ లీడర్ మంగమ్మ, కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ ఐలయ్య, కౌన్సిలర్లు, నాయకులు గోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ సెంటర్ పరిశీలన..
తొర్రూర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరితధన్రాజ్ గౌడ్, కమిషనర్ అహ్మద్ షపీ ఉల్లా, కౌన్సిలర్లతో కలిసి చైర్ పర్సన్ మల్రెడ్డి అనురాధ పరిశీలించారు. వ్యాక్సినేషన్ సెంటర్కు ప్రజలు భారీగా తరలిరావడంతో గందరగోళం నెలకొంది. ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఎన్రోల్మెంట్ చేయించుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామన్నారు. నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.