న్యూఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.63కోట్లకుపైగా కరోనా టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. కేంద్రం ఇప్పటి వరకు ఉచితంగా, ప్రత్యక్షంగా సేకరించి రాష్ట్రాలకు 24 కోట్లకుపైగా మోతాదులు సరఫరా చేసినట్లు పేర్కొంది. ఇందులో వ్యర్థాలతో సహా 22,96,95,199 మోతాదులు మోతాదులను వినియోగించినట్లు పేర్కొంది. ఇంకా 1,63,85,701 డోసులు ఇప్పటికీ రాష్ట్రాలు, యూటీల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పింది. ఆదివారం ఉదయం 7 గంటల వరకు అందించిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా 32,42,503 సెషన్ల ద్వారా మొత్తం 23,13,22,417 మోతాదులు లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు చెప్పింది.