బంజారాహిల్స్, మే 21: రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్లో మురుగు సమస్యను పరిష్కరించేందుకు రూ.45లక్షలు మంజూరయ్యాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. రహ్మత్నగర్ డివిజన్ పరిధిలో శుక్రవారం పర్యటించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రహ్మత్నగర్ ఔట్పోస్ట్ నుంచి శ్రీరాంనగర్ చౌరస్తా వరకు రూ.54లక్షలతో చేపట్టిన ఫుట్పాత్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లాక్డౌన్ సమయంలో కూడా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని, పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీరాంనగర్లో మురుగు సమస్య పరిష్కారానికి రూ.45లక్షలు మంజూరయ్యాయని, పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సీఎన్.రెడ్డితో పాటు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని జీహెచ్ఎంసీ అన్నపూర్ణ క్యాంటీన్లో ఉచిత భోజనం కౌంటర్ పనితీరును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శుక్రవారం పరిశీలించారు. లాక్డౌన్ సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉచిత భోజన సదుపాయం కల్పించిందని, లాక్డౌన్ ముగిసేదాకా పేదలకు భోజనం అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సీఎన్.రెడ్డి పాల్గొన్నారు.