షేక్పేట్ ఆగస్టు 10 : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. షేక్పేట్లో మంజూరు అయిన 312 రేషన్ కార్డులను టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్కుమార్తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలతో రాష్ట్రంలో కోట్లాది మంది పేదలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.