హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న రహ్మత్నగర్ డివిజన్కు చెందిన లబ్ధిదారులకు సోమవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
నాగవర ప్రసాద్ అనే వ్యక్తికి రూ.60వేలు, మెయినుద్దీన్ అలీకి రూ.22వేలు, రత్నయ్యకు రూ.26వేల చెక్కులతో పాటు తాహేరాబేగంకు నిమ్స్లో వైద్యం నిమిత్తం రూ.90వేల ఎల్వోసీ పత్రాన్ని ఎమ్మెల్యే మాగంటి అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలోనే సామాన్యుడికి సైతం మేలు జరుగుతుందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతో మందికి సీఎం సహాయ నిధి వరంగా మారిందని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పాలనలోనే ఎక్కువ మంది సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందారన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
మోదీజీ పుట్టగొడుగులు మానేసి ఐదు రోజులు ఈ ఆహారం తీసుకోండి!
ఆధ్మాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం : మంత్రి ఐకే రెడ్డి
సమాజానికి దారి చూపే రచనలు రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్