కేపీహెచ్బీ కాలనీ, మే 28 : మానవతా ద్రక్పథంతో స్వచ్ఛంద సంస్థలు ఉచిత ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్, దిశ స్వచ్ఛంద సంస్థలు, జీహెచ్ఎంసీ సంయుక్తాధ్వర్యంలో కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్లోని మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత ఐసొలేషన్ సెంటర్ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాను కట్టడి చేయడం, కరోనా బారిన పడ్డవారికి ఉచితంగా వైద్య సేవలందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా సోకి ఇంట్లో ఐసొలేషన్ వసతి లేనివారికి ప్రభుత్వ ఐసొలేషన్ సెంటర్లను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. విపత్కర పరిస్థితుల్లో తామున్నామంటూ ముందుకొచ్చిన సంస్థ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో జడ్సీ మమత, డీసీ రవికుమార్, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు పాల్గొన్నారు.
కూకట్పల్లి జోన్లో రెండు ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు హిమజారెడ్డి తెలిపారు. కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్లోని మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్లో 40 బెడ్లతో, అల్వాల్ సర్కిల్లోని కొత్తబస్తీ అంబేద్కర్ భవనంలో 40 బెడ్లతో కూడిన ఐసొలేషన్ కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఐసొలేషన్ కేంద్రాలకు వచ్చే కరోనా బాధితులకు ఉచితంగా ఆహారం, ఫ్రూట్స్, టాబ్లెట్లు, మెడిటేషన్ను అందించనున్నట్లు తెలిపారు. మూడు వైద్యశాలల సహకారంతో ఐసొలేషన్ కేంద్రాల్లో నిరంతరం వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించిన వారికి ఇంట్లో హోం ఐసొలేషన్లో ఉండడానికి వసతి లేనివారికి ఈ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మరిన్ని వివరాలకు 9182735664 నంబర్ను సంప్రదించాలని కోరారు.