కేపీహెచ్బీ కాలనీ,ఆగస్టు5: కేపీహెచ్బీ కాలనీలో అత్యాధునిక వసతులతో రైతుబజార్ను అందుబాటులోకి తేనున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. గురువారం కేపీహెచ్బీ కాలనీలో నిర్మిస్తున్న మోడల్ రైతుబజార్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా గుర్తింపు పొందిన కేపీహెచ్బీ కాలనీలో పెరిగిన అవసరాలకనుగుణంగా రైతుబజార్ను విస్తరిస్తామన్నారు. రూ.15కోట్లతో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తామని సెల్లార్లో పార్కింగ్,1,2వ అంతస్తులో రైతులకుస్టాల్స్, రెస్ట్ రూమ్, క్యాంటీన్, సులబ్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతుబజార్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నా రు.కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీనివాస్రావు, శిరీషా బాబురావు, రవీందర్రెడ్డి, నర్సింహాయాదవ్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ సెక్రటరీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్శ్రీనివాస్, మార్కెటింగ్ డీఈ రవీందర్, రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ సుధాకర్, నేతలు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ మొదటి రోడ్డులో సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే కృష్ణారావు పాత విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మధుగౌడ్తో కలిసి బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సతీశ్గౌడ్, మాజీ కార్పొరేటర్లు శ్రవణ్కుమార్, బాబూరావు, జీహెచ్ఎంసీ ఎస్ఈ శంకర్ నాయక్, డీఈ శ్రీదేవి, ఏఈ సాయిప్రసాద్ ఉన్నారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును వసంతనగర్ సొసై టీ నూతన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల్లో డైరెక్టర్లుగా విజ యం సాధించడంతో పాటు సొసైటీ కమిటీ సభ్యులుగా, డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో సొసైటీ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు రాణాప్రతాప్, కార్యదర్శి వి.కృష్ణమూర్తి, కోశాధికారి నర్స య్య, డైరెక్టర్లు పద్మ, వీ.ఎన్.వి.ప్రసాద్, డి.అనీల్కుమార్ వర్మ, నాగిరెడ్డి, రజని, చంద్రారెడ్డి, నాంచారయ్య, నియో జకవర్గ కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, శ్యామలరాజు, పూర్ణ చందర్రావు, వెంకటేశ్వర్రావు, దీన్దయాల్ ఉన్నారు.