కేపీహెచ్బీ కాలనీ, జూలై 21 : కష్టాల్లో ఉన్న పేదవారికి ప్రభుత్వం అండగా ఉండి, సహకారాన్ని అందిస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన 12 మందికి రూ.4.49 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో దవాఖానలో చేరిన పేదలు ఖర్చులు భరించలేక సర్వస్వం కోల్పోయే పరిస్థితులు ఉంటాయన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దన్నారు.
400 ఏండ్ల చరిత్ర కలిగిన కూకట్పల్లి రామాలయం పునర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్పల్లి రామాలయంలో నిర్మాణ పనుల పురోగతిపై ఆలయ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు 80 శాతం పూర్తి అయ్యాయని, మిగిలిన పనులను వేగవంతం చేయాలన్నారు. ఫిబ్రవరి లోగా పూర్తి హంగులతో రామాలయ పనులు పూర్తైతే ప్రారంభోత్సవం చేయాలన్నారు. శ్రీత్రిదండి చినజీయర్ స్వామిని కలిసి ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తాన్ని నిర్ణయించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాయినేని తులసీరావు, యాదగిరిరావు, నర్సింగ్ గౌడ్, ఆండాలమ్మ, పగుడాల బాబూరావు తదితరులు ఉన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని అల్లాపూర్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృష్ణారావు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. జ్యోతినగర్, గాయత్రీనగర్ హరిహర టెంపుల్ ఎదురుగా వర్షంనీటి కాలువ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అజీజ్నగర్లో ఓపెన్ డ్రైన్ పనులు, రాజీవ్గాంధీనగర్లో పైపులైన్ పనులు, కమ్యూనిటీ హాల్ 1వ అంతస్తు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కృష్ణారావు ప్రారంభించనున్నట్లు తెలిపారు.