బాలానగర్, జూలై 20 : టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సీ నియర్ సిటిజన్లకు అండ లభిస్తుందని కూకట్పల్లి ఎమ్మె ల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఫతేనగర్ డివిజన్ పరిధిలోని భరత్నగర్కాలనీ ఎల్ఐజీలో రూ.15 లక్షల నిధులతో నిర్మించిన సీనియర్ సిటిజన్ భవనం పైఅంతస్తును స్థానిక కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఫతేనగర్ ఎల్బీఎస్నగర్లో ఏర్పాటు చేయనున్న ఎస్టీపీ ప్లాంట్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినతర్వాతే అన్ని వర్గాలవారికి మేలు జరుగుతుందన్నారు. కూ కట్పల్లి నియోజకవర్గం మౌలిక సదుపాయాల కల్పనలో ముందువరుసలో ఉన్నదన్నారు. ఫతేనగర్ ఎల్బీఎస్నగర్లో రూ.300 కోట్ల నిధులతో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణపనులను ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారన్నారు. నీరు కాలుష్యం కాకుండా ఉండేందుకు ఎస్టీపీ ప్లాంట్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. అ నంతరం కార్పొరేటర్ సతీశ్గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో ఫతేనగర్ డివిజన్ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కె.రాములు, సు దర్శన్రెడ్డి స్థానికులు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ, జూలై 20 : టీఆర్ఎస్ బలోపేతం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త సాయిబాబా భార్య ధనలక్ష్మి, పిల్లలకు రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును ఎ మ్మెల్యే కృష్ణారావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్ భరత్నగర్ ఈడబ్ల్యూఎస్ గృహాలలో నివసిస్తున్న సాయిబాబా టీఆర్ఎస్ సభ్యత్వాన్ని తీసుకున్నాడు. అయితే కొద్ది రోజుల కిందట ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం రోడ్డున పడింది. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా అవకాశాన్ని కల్పించిన టీఆర్ఎస్.. కార్యకర్త సాయిబాబా మృతి చెందడంతో ప్రమాద బీమా డబ్బులను అతని భార్యకు అందజేసినట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ గుర్తింపు ఇస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పేదలందరికీ సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్ తదితరులు ఉన్నారు.