కేపీహెచ్బీ కాలనీ, జూలై 13 : పేదింటి ఆడపిల్లల పెండ్లికి పెద్దన్నలా సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన 124 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కృష్ణారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులతో కష్టాలు పడకూడదని సీఎం కేసీఆర్ గొప్ప పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఆడపిల్లను ఇంటినుంచి అత్తారింటికి సాగనంపేటప్పుడు తల్లిదండ్రులు బాధపడకుండా ఆర్థిక సహాయం అందుతుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నేత ఇర్ఫాన్ తదితరులు ఉన్నారు.
బాలానగర్, జూలై 13 : భవిష్యత్ తరాలకు పచ్చదనం అందించడం ప్రభుత్వ లక్ష్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని నర్సాపూర్ చౌరస్తా ఎంఎస్ఎంఈ ప్రహరీకి ఆనుకొని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్, మల్టీలెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్ను డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి, ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కల పెంపకంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాభివృద్ధితో పాటు భవిష్యత్ తరాలకు పచ్చదనానికి ఇబ్బందులు లేకుండా భూగర్భ జలాలు పెరుగడం కోసం ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మొక్కల పెంపకంలో హైదరాబాద్ నగరం రికార్డు సృష్టించడం ఖాయమన్నారు.
నగరంలో మొక్కలు పెంచడంతో కాలుష్యం తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. కాలుష్యం పెరుగుతుండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి ముందుతరాలకు ఆదర్శంగా నిలువాలని సూచించారు. అనంతరం కార్పొరేటర్లు మాట్లాడుతూ.. మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. మొక్కలు పెంపకం ద్వారా ప్రాణవాయువు మెరుగుపడటంతో పాటు కాలుష్య కారకాలు తగ్గు ముఖం పడుతాయన్నారు. కార్యక్రమంలో కూకట్పల్లి డీసీ వి. ప్రశాంతి, బాలానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మందడి సుధాకర్రెడ్డి, ఫతేనగర్ డివిజన్ అధ్యక్షుడు కంచి భిక్షపతి, అంబటి సునీల్కుమార్, శ్రీనివాస్రాజు, కృష్ణమూర్తి, దామోదర్రెడ్డి, కిరణ్గుప్తా, ఖాజా తదితరులు పాల్గొన్నారు.