కేపీహెచ్బీ కాలనీ, జూలై 12 : నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యతక్రమంలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీలలో మౌలిక వసతులు కల్పించే దిశగా పనులు చేస్తున్నామని, ప్రధాన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించడం,తాగునీటి వ్యవస్థను బలోపేతం, పార్కులు, క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఫ్లై ఓవర్ల నిర్మాణం, లింక్ రోడ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. డివిజన్ల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తానని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, కొత్త భవనాల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, జూపల్లి సత్యనారాయణ, ఆవుల రవీందర్రెడ్డి, ముద్దం నర్సింహా యాదవ్, పండాల సతీశ్గౌడ్, పగడాల శిరీషాబాబురా వు, సబీహాగౌసుద్దీన్, నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, టీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.