కేపీహెచ్బీ కాలనీ, జూలై 11 : కష్టాల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరం లాంటిదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కూకట్పల్లి నియోజకవర్గంలోని 24మంది లబ్ధిదారులకు రూ. 9.82 లక్షల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో దవాఖానల్లో చేరిన పేదలు వైద్య ఖర్చులు భరించలేక నానా ఇబ్బందులు పడుతుంటారని, ఇలాంటి పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందన్నారు.
బాలానగర్ ఫ్లై ఓవర్కు బాబు జగ్జీవన్రామ్ పేరును ప్రతిపాదించినందుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ఇంద్రానగర్ అంబేద్కర్ సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత సంఘం నేతలు పూలమాలలు, శాలువాతో కృష్ణారావును సన్మానించారు. గతంలో మెట్రోస్టేషన్కు అంబేద్కర్ పేరును పెట్టడానికి కృషి చేసిన ఎమ్మెల్యే.. తాజాగా బాలానగర్ ఫ్లైఓవర్కు బాబు జగ్జీవన్రామ్ పేరును సూచించడం దళితులందరికీ దక్కిన గౌరవమన్నారు. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుండగా దళిత సమాజానికి ఎమ్మెల్యే కృష్ణారావు అండగా నిలవడం సంతోషకరమన్నారు.
దళితులకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు దళిత సంఘం నేతలు పాల్గొన్నారు.