మూసాపేట, జూన్ 15 : కరోనా సంక్షోభ సమయంలోనూ అభివృద్ధి పనులు ఎక్కడా ఆగకుండా పూర్తి చేస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మూసాపేట డివిజన్ పరిధిలోని వడ్డెర బస్తీలో రూ. 27 లక్షల అంచనా వ్యయంతో కమ్యూనిటీహాల్ పునర్నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డివిజన్లలో దశల వారీగా సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ కార్పొరేటర్ కోడిచర్ల మహేందర్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సత్యం, టీఆర్ఎస్ సీనియర్ నేతలు అంబటి శ్రీనివాస్, జిల్లా గోపాల్, తుకారాం, విష్ణు, రాజు, శివ, జైరాజ్, అరుణ్, నవాజ్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్నగర్లో రూ. కోటి 40లక్షల వ్యయంతో అత్యాధునిక హంగులతో జీ+1 ఆంతుస్తులతో నూతనంగా నిర్మించిన మినీ ఫంక్షన్హాల్ను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ మహ్మద్ సబిహబేగంతో కలసి మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్, డివిజన్, బస్తీ నాయకులు, మహిళలు, వార్డు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, జూన్ 15 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఫతేనగర్ డివిజన్లో రూ.ఒక కోటి లక్షా 70 వేల నిధులతో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ సతీశ్గౌడ్తో కలిసి ఆయన శ్రీకారం చుట్టారు. హెచ్పీరోడ్డు వద్ద బాక్స్ కల్వర్ట్ నిర్మాణం కోసం రూ. 36.70 లక్షలు, ప్రభాకర్రెడ్డినగర్లో కమ్యూనిటీహాల్ నిర్మాణం కోసం రూ. 15 లక్షలు, ఫతేనగర్ నాలా కల్వర్ట్ నిర్మాణం కోసం రూ.19.50 లక్షలు, ఇందిరాగాంధీపురం, ఎల్బీఎస్నగర్లలో భూగర్భ డ్రైనేజీ లేయింగ్ పనుల కోసం రూ.30.50 లక్షలు కేటాయించి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఫతేనగర్ డివిజన్లో గతంలో ఎప్పుడూలేని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు అలుపెరుగని కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్ష తెలుసుకొని వాటిని పరిష్కరించడం కోసం తనదైన శైలీలో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాములు, భిక్షపతి, జగదీశ్, రాంరెడ్డి, శంకర్గౌడ్, సుదర్శన్రెడ్డి, పవన్, రాము, కీర్తి, బస్వరాజ్, బాలకృష్ణ, సలావుద్దీన్, అఫ్జల్, నషు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
కరోనాను ఖతం చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ భాగ్యశ్రీగార్డెన్లో కొత్తగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను కార్పొరేటర్ ముద్దం నర్సింహాయాదవ్, కూకట్పల్లి జడ్సీ మమతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మూడోవేవ్ రాకుండా నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టకొని సీఎం కేసీఆర్ వ్యాక్సినేషన్ సెంటర్ల ఏర్పాటుకు చొరువ చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో కూకట్పల్లి డీసీ ప్రశాంతి, నరేందర్గౌడ్, కర్రె జంగయ్య, సయ్యద్ ఎజాజ్, ఇర్ఫాన్, మక్కల నర్సింగ్, ఉదయరాణి, లలిత వైద్యసిబ్బంది స్థానికులు తదితరులు పాల్గొన్నారు.