బాలానగర్, జూన్ 8 : ఫతేనగర్ ఎల్బీఎస్నగర్, శివశంకర్నగర్లో పురాతన డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణకు కృషి చేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఫతేనగర్ ఎల్బీఎస్నగర్లో స్థానిక కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్తో కలిసి జలమండలి స్థలాన్ని జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నాలా నీరు డ్రైనేజీలో కలువకుండా ఉండటం కోసం ఎస్టీపీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫతేనగర్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. జలమండలి ఆధీనంలోని స్థలం మీదుగా డ్రైనేజీ పైపులైన్ వేయడానికి సంబంధిత అధికారుల అనుమతి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. డ్రైనేజీ పైపులైన్ పనుల కోసం రూ. 20 లక్షలు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో జలమండలి జీఎం హరి శంకర్, జీహెచ్ఎంసీ డీఈ ఆనంద్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కె. రాములు, భిక్షపతి, బాలకృష్ణ, శివశంకర్గౌడ్, బస్వరాజ్, సాయినాథ్గౌడ్, శ్రీను, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.