కాచిగూడ, సెప్టెంబర్ 23: నియెజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్ సుందర్నగర్లో రూ.9 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను గురువారం గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం డివిజన్లోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లోని డైనేజీ, పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంకటేశ్ మాట్లాడుతూ మౌలిక సదుపాయలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు స్థానికులు పర్యవేక్షించినప్పుడే నాణ్యమైన పనులు జరుగుతాయని పేర్కొన్నారు. గోల్నాక డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్గౌడ్, గోల్నాక టీఆర్ఎస్ అధ్యక్షుడు భరత్రాజ్ ముదిరాజ్, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఎంహెచ్వో జ్యోతి, ఏఈ ఫరీద్, మనోహర్, నరేందర్, షాకీర్, జనార్దన్, పడకంటి అంజయ్యచారి, ప్రభాకర్ ముదిరాజ్, పి.సంతోష్, సర్వర్, మూసాబాయి, మోయిన్, అక్రం తదితరులు పాల్గొన్నారు.