గోల్నాక, సెప్టెంబర్ 13 : నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం అంబర్పేట డివిజన్లోని అహ్మద్నగర్, నరేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్, పలు శాఖల అధికారులతో కలసి ఆయన క్షేత్రస్థాయిలో పాదయాత్ర నిర్వహించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నామన్నారు. రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్ల ఏర్పాటు పనులను ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. పలు శాఖల అధికారులు కుశాల్, సంతోష్, సుధాకర్, దుర్గతో పాటు టీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంజనేయులు, అమనురి సతీశ్, లింగారావు, సలీం, ప్రవీణ్ పటేల్, జాకీబాబు, మహేశ్ముదిరాజ్, మల్లికార్జున్యాదవ్, జఖీర్, మోసిన్, మహ్మద్గౌస్ పాల్గొన్నారు.