అంబర్పేట/కాచిగూడ, జూలై 29 : అర్హులైన పేదవారందరికీ తెల్ల రేషన్కార్డులు వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్లోని భరత్నగర్ కమ్యూనిటీహాల్లో డివిజన్కు చెందిన లబ్ధిదారులకు కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే రేషన్కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ కొత్త రేషన్కార్డులు అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట తదితర డివిజన్లలో పేదలకు ప్రభుత్వం ద్వారా రేషన్కార్డులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటు నాయకులు శ్రీరాములు ముదిరాజ్, ఎర్రబోలు నర్సింహారెడ్డి, శివాజీయాదవ్, నర్సింగ్, మహేందర్రెడ్డి, అజయ్కుమార్, జె. బాలరాజు, కృష్ణ, శ్రీనివాస్, సునీత, చుక్కజగన్, చారి, సురేశ్కుమార్, టి. వెంకటేశ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కాచిగూడ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్యెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం నింబోలిఅడ్డాలోని ఏకే భవన్లో కాచిగూడ డివిజన్లోని పేదలకు కొత్త రేషన్ కార్డులను ఎమ్యెల్యే కాలేరు, కార్పొరేటర్ ఉమాదేవి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ పథకాల అమలులో పొరుగు రాష్ర్టాల కంటే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నె రమేశ్యాదవ్, ఏఎస్ఓ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ సావిత్రి, రవియాదవ్, రమాదేవి, భీంరాజ్, మల్లికార్జున్, పంకజ్, దీపక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.