కాచిగూడ, జూలై 27: నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తేలేదని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని లింగంపల్లి నుంచి చెప్పల్బజార్ హరిమాజీద్ వరకు రూ.14.70 లక్షలతో.. అదేవిధంగా మోతిమార్కెట్ శివాలయం నుంచి నింబోలిఅడ్డావరకు రూ.4 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్ పనులను మంగళవారం కాచిగూడ కార్పొటర్ ఉమాదేవితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బస్తీలో ఎమ్మెల్యే కాలేరు, కార్పొరేటర్ పర్యటించి స్థానికుల నుంచి నీటి, డ్రైనేజీ సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. పలుప్రాంతాల్లో ఉన్న నీటి కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థను అతిత్వరలో ఆధునీకరించనున్నట్లు ఆయన అన్నారు. హైదరాబాద్ మోడల్ సిటీగా రూపు దిద్దుకోవడానికి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, అర్హులైన పేదలకు సీఎం కేసీఆర్ లక్షల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వడంతో పొరుగు రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఫ్లోర్లీడర్ దిడ్డి రాంబాబు, కన్నె రమేశ్యాదవ్, సునీల్బిడ్లాన్, డాక్టర్ శిరీషాయాదవ్, బద్దుల ఓం ప్రకాశ్యాదవ్, బీమాగౌని కృష్టాగౌడ్, జలమండలి జీఎం.సుబ్బారాయుడు, డీజీఎం సన్యాసిరావు, మేనేజర్ మహేందర్రెడ్డి, భావన, రమాదేవి, ఎర్ర భీష్మ, నాగేందర్బాబ్జి, బబ్లూ, నాగరాజుగౌడ్, మన్నె శ్రీనివాస్యాదవ్, బండారు సంతోష్కుమార్, తుమ్మల నర్సింహారెడ్డి,, శ్రీకాంత్, సుభాష్పటేల్, క్షీర్సాగర్, రవియాదవ్, మల్లికార్జున్, రమాదేవి, మురళి, పంకజ్,దీపక్, వెంకటేశ్ పాల్గొన్నారు.