అంబర్పేట, జూలై 24 మొయిన్ చెరువు వరదనీరు ఇండ్లలోకి రాకుండా ఉండేందుకు రూపొందించిన ప్లాన్పై శనివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులతో చర్చించారు. కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్, ఎస్ఎన్డీపీ అధికారులు, ఇంజినీర్లు, జీహెచ్ఎంసీ, వాటర్వర్క్స్ అధికారులతో కలిసి మొయిన్ చెరువు నుంచి అంబర్పేట ఎస్టీపీ వాటర్ వర్క్స్ గేటు వరకు గల నాలా పరీవాహక ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. వాన కురిసినప్పుడు మొయిన్ చెరువు నుంచి వచ్చే వరదనీరు బస్తీల్లోకి రాకుండా రెండు వేర్వేరు నాలాల ద్వారా మూసీలో కలిసే విధంగా నిర్మాణం చేపట్టే అం శాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ డీఈ వెంకట్కిరణ్రెడ్డి, ఏఈ సతీశ్, ఎన్సీపీఎఫ్ కన్సల్టెన్సీ కిరణ్, ఇరిగేషన్ డీఈ నళిని, జీహెచ్ఎంసీ డీఈలు సుధాకర్, సంతోష్, ఏఈలు ప్రేరణ, ఫరీద్, శ్వేత, వాటర్వర్క్స్ ఏఈ కుశాల్, టీఆర్ఎస్ నాయకులు అఫ్రోజ్పటేల్, శ్రీరాములుముదిరాజ్, మహేందర్రెడ్డి, వినోద్, ప్రవీణ్, శేఖర్, చింటు పాల్గొన్నారు.