గోల్నాక, జూలై 19 : ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. ప్రతి ఒక్కరూ ఐదు మొక్కల చొప్పున నాటి మంత్రి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని ఆయన పిలుపు నిచ్చారు. సోమవారం సీపీఎల్ మైదానంలో స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్, ఈస్ట్జోన్ డీసీపీ రమేశ్, సీపీఎల్ అసిస్టెంట్ కమాండర్ త్రిలోక్నాథ్రెడ్డి, అడిషనల్ డీసీపీ మురళీధర్, ఆర్ఐలు మధుసూదన్రావు, నాగరాజు, కేఎల్ నాయుడు, హార్టికల్చర్ అధికారులు శ్రీధర్ తదితరులతో కలసి ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. సీపీఎల్ మైదానంలో మొక్కలు నాటడానికి అనువుగా ఉన్న స్థలాలను ఆయన పరిశీలించారు. రికార్డు స్థాయిలో మొక్కలు నాటడం తో పాటు సంరక్షణ చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు