గోల్నాక, జూలై 13 : గత కొన్నేండ్లుగా వానకాలంలో అంబర్పేట డివిజన్లోని పలు లోతట్టు ప్రాంతాలను ముంపునకు గురిచేస్తున్న దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం మోహిన్ చెర్వు నుంచి అంబర్పేట డివిజన్ సీపీఎల్ మూసీ నాలా విస్తరణ చర్యల్లో భాగంగా గోల్నాకలోని ఆయన క్యాంపు కార్యాలయంలో స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్, నాలా ప్రాజెక్టు అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతమైన బాగ్అంబర్పేట మోహిన్చెర్వు నాలా నుంచి వచ్చే వరద ఉధృతి వల్ల బాపునగర్, చెన్నారెడ్డి నగర్ సిబ్లాక్, పటేల్నగర్, ప్రేమ్నగర్ తదితర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం సీపీఎల్ నాలాను విస్తరించాల్సిన అవసరమున్నదన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, నాలా ప్రాజెక్టు అధికారులు, టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, లింగారావు, మహేశ్ యుదిరాజ్, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.
వానకాలంలో ముంపు సమస్య నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అ న్నారు. మంగళవారం పలు శాఖల అధికారులతో కలిసి బాగ్అంబర్పేట శివం రోడ్డు నుంచి ఛే నంబరు మీదు గా గోల్నాక డీమార్టు వరకు ఉన్న వరదనీటి నాలాను పరిశీలించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు నాలాలో వరదనీరు నిలువకుండా సజావుగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించా రు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, వర్క్ఇన్స్పెక్టర్ మనోహర్, జలమండలి అధికారులు రోహిత్ అక్షాక్, మల్లేశ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.