అంబర్పేట/గోల్నాక, 10 : పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా పది రోజుల పాటు చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశా మని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం స్ఫూర్తితో నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం అంబర్పేట డివిజన్లోని అనంతరాంనగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్, మాజీ కార్పొరేటర్ కె.పద్మావతిడీపీరెడ్డితో పాటు పలుశాఖల అధికారులతో కలసి పదవ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాలనీలోని పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ, మంచినీటి సరఫరా, వెలగని వీధి దీపాల సమస్యలను పరిష్కరించడంతో పాటు కాలనీని ఆదర్శకాలనీగా అభివృద్ధి చేస్తామని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు. అధికారులతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అంబర్పేట : పచ్చదనం, స్వచ్ఛతే లక్ష్యంగా పది రోజుల పాటు కొనసాగిన పట్టణ ప్రగతి శనివారంతో ముగిసింది. అంబర్పేట నియోజకవర్గం పరిధిలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట డివిజన్ల పరిధిలోని అన్ని బస్తీలు, కాలనీలలో జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, పారిశుధ్యం, ఉద్యానవన శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి సమస్యలు పరిష్కరించారు. ఒక్కోరోజు ఒక్కో బస్తీ పర్యటించి పేరుకుపోయిన మట్టికుప్పలు, చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగింపజేశారు. బస్తీలలో రోడ్డు ప్యాచ్వర్క్ పనులను జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు, మంచినీటి లోప్రెషర్, డ్రైనేజీ సమస్యలను జలమండలి అధికారులు పరిష్కరించారు. కొన్ని చోట్ల వరద ముంపు సమస్య, వీధి దీపాల నిర్వహణ, తుప్పు పట్టిన కరెంటు స్తంభాల తొలగింపు వినతులు ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చాయి. వాటిని పరిష్కరించాలని వారు అధికారులకు తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్ని డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి హరితహారం కూడా నిర్వహించారు.
మొక్కలు నాటిన వారే వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. పట్ణణ ప్రగతిలో భాగంగా శనివారం బాగ్అంబర్పేట డివిజన్లోని ఇంద్రప్రస్థకాలనీలో కార్పొరేటర్ బి.పద్మా వెంకటరెడ్డితో కలిసి అక్కడి పార్కులో మొక్కలు నాటారు. అనంతరం కాలనీలో ఉన్న ల్రైబరీని సందర్శించి అందులోకి కావాల్సిన ఫర్నిచర్, పుస్తకాలు, బుక్ర్యాక్స్ వంటి సదుపాయాల పై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏఈ సౌమ్య, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, కాలనీవాసులు ప్రభాకర్రెడ్డి, మహిపాల్రెడ్డి, శశికుమార్, అనూరాధ, దేవిరెడ్డి, అరుణ, ప్రసాద్, అభిషేక్, సుబ్బారావు పాల్గొన్నారు.
నల్లకుంట శివం రోడ్డులో జరుగుతున్న వరదనీటి కాలువ నిర్మాణం పనులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శనివారం పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతుండటంపై ఎమ్మెల్యే కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా నాణ్యత లోపం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, ఏఈ ఫరీద్, సీఆర్ఎంపీ మనోహర్, వాసుదేవరెడ్డి, అభిలాష్, జానకీరామ్, నాయకులు అమృత్సింగ్, మిర్యాల రవీందర్, మహేశ్, శేఖర్, సాయి తదితరులు పాల్గొన్నారు.