కాచిగూడ, ఏప్రిల్ 1 : అంబర్పేట నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని అన్నారు. గురువారం గోల్నాక డివిజన్లోని ఖాజా గరీబ్నగర్లో రూ.11 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న మంచినీటి పైపులైన్ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం మహేశ్కుమార్, డీజీఎం సన్యాసిరావు, మేనేజర్ మహేందర్రెడ్డి, దూసరి శ్రీనివాస్గౌడ్, భరత్ముదిరాజ్,లక్ష్మణ్, ఇంతియాజ్, ఆసిఫ్, ప్రదీప్, యాదగిరి, జ్ఞానేశ్వర్, సాయి, యూసుఫ్, సుమ, లావణ్య, ఆర్కె బాబు, కాలేరు రామకృష్ణ, సతీశ్, ప్రభాకర్ ముదిరాజ్, చరణ్, ఉమా, లక్ష్మి ముదిరాజ్, పల్లవి పాల్గొన్నారు.