గోల్నాక, జూన్ 22 : నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ సమస్యకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రక్షాళన చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇందుకు సంబంధించి కొత్త పైపులైన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం గోల్నాక డివిజన్లోని సాయిబాబా గుడిలైన్తో పాటు భారతీయ విద్యాభవన్ స్కూల్ వద్ద రూ.7.35లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైపులైన్ పనులను స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు ప్రాంతాల్లో భవిష్యత్లో ఎలాంటి మురుగు సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.
కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ..డివిజన్లో మౌలిక వసుతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం బస్తీల్లో పర్యటించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్తీలో హై-మాస్ట్ లైట్ల ఏర్పాటుతో పాటు మంచినీటి సరఫరా సమయాన్ని పెంచాలని స్థానికులు కోరారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారును ఆయన ఆదేశించారు. ఈకార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు సుధాకర్, మనోహర్, జలమండలి అధికారులు రోహిత్, అశ్వక్, టీఆర్ఎస్ నాయకుడు భరత్ముదిరాజ్, లక్ష్మణ్, ఆర్కేబాబు, రాము, నర్సింగ్యాదవ్, లింగంగౌడ్, కొమ్మ శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, అంజయ్యచారి, ప్రభాకర్, శ్రీను, వెంకట్, ధనలక్ష్మి, ఉమ, లక్ష్మి, పల్లవి తదితరులు పాల్గొన్నారు.