అంబర్పేట, జూన్ 13: అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో జోరుగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్పేట డివిజన్లోని చెన్నారెడ్డినగర్, బాపూనగర్ బస్తీలలో ఆదివారం ఆయన పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే అన్ని సమస్యలు తొందరగా పరిష్కరిస్తానని తెలిపారు. అన్ని బస్తీలు, కాలనీల్లో వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.