కాచిగూడ,జూన్ 7: నియోజకవర్గ ప్రజలకు వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని, డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని మోతీలాల్ నెహ్రూనగర్లో రూ.9 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేసిన మంచినీటి పైపులైన్ పనులను సోమవారం కాచిగూడ కార్పొటర్ ఉమాదేవితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్య మురుగు ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎప్పుడో ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైపులైన్లు నేటి జనాభా అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోందని అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అంబర్పేట నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దిడ్డి రాంబాబు, డాక్టర్ శిరీషాయాదవ్, బద్దుల రవీందర్యాదవ్, ఓం ప్రకాశ్యాదవ్, బి.కృష్టాగౌడ్, రమేశ్యాదవ్, రమాదేవి, ఎర్ర భీష్మ, బబ్లూ, శివకుమార్, మున్నా, సల్మాన్రాజ్, వినోద్యాదవ్, సుభాశ్పటేల్, రవియాదవ్, జలమండలి అధికారి మహేందర్రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.