అంబర్పేట, జూన్ 5: అంబర్పేట నియోజకవర్గంలోని పలు బస్తీలు, కాలనీల్లో రూ.5.30కోట్ల వ్యయంతో నూతన సీసీ, వీడీసీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించగా వాటికి నిధులు కూడా మంజూరయ్యాయని తెలిపారు. బాగ్అంబర్పేట డివిజన్లోని పాములబస్తీలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి శనివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట ఐదు డివిజన్లలోని బస్తీలు, కాలనీల్లో ఇప్పటికే పలు సీసీ, బీటీ, వీడీసీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు.
గత జనవరిలో రోడ్ల నిర్మాణానికి రూ.5.30 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇప్పుడు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసుకొని పనులు మొదలవుతాయని చెప్పారు. అలాగే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి, డ్రైనేజీ పైపులైన్ల ఆధునీకరణకు రూ.2 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ ప్రేరణ, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, టీఆర్ఎస్ నాయకులు శ్రీరాములుముదిరాజ్, చంద్రమోహన్, కె.నర్సింగ్రావు, రవీందర్, శ్రీనివాస్, ప్రసాద్, అఖిలేశ్, రాజేశ్, సుభాష్, బీజేపీ నాయకులు బి.వెంకటరెడ్డి, సి.కృష్ణాగౌడ్, ఇ.అజయ్కుమార్, కొడూరి సురేశ్, శ్రీను, ముఖేశ్గౌడ్ పాల్గొన్నారు.