అంబర్పేట/కాచిగూడ, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బుధవారం అంబర్పేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. అంబర్పేట, బాగ్అంబర్పేట, గోల్నాక, నల్లకుంట, కాచిగూడ తదితర డివిజన్లలో జాతీయ, టీఆర్ఎస్ జెండాను ఎగుర వేశారు. గోల్నాక డివిజన్లోని గంగానగర్ డీమార్ట్ వద్ద నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కాచిగూడ ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డీఐ యాదేందర్, ఎస్సైలు శ్రీనివాస్,వి.లక్ష్మయ్య, బి.నాగార్జునరెడ్డి, సైదులు, ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.
టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఫ్లోర్లీడర్ దిడ్డి రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం బర్కత్పురలో అవతవరణ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సదానంద్, సాయి, మల్లేశ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.