అంబర్పేట, మే 11: నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం బాగ్అంబర్పేట డివిజన్ శ్రీనివాస్నగర్ కాలనీలో ఆయన పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన కమ్యూనిటీ హాల్ను తొలగించి అన్ని వసతులతో కూడిన కొత్త కమ్యూనిటీహాల్ను నిర్మించాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించిన ఆయన కొత్త భవనం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అనంతరం కాలనీలో ఇంటింటికీ శానిటైజేషన్ చేయించి కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ చీఫ్ శ్రీరాంబాబు, ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ అంబికతో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు మోర శ్రీరాములుముదిరాజ్, దిలీప్రాజ్, మహేశ్, సుభాష్, శ్రీనివాస్, మురారి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.