హైదరాబాద్ : ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులను యూసుఫ్గూడ డివిజన్ శ్రీకృష్ణానగర్లో లబ్ధిదారులకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో కాంగ్రెస్, బీజేపీలు గతంలో కానీ.. ప్రస్తుతమైనా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు మేలు చేకూర్చే అనేక పథకాలు అమలుచేస్తున్నందునే ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నకల్లో ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు.
తెలంగాణలో అమలవుతున్న షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, ఒంటరి మహిళ తదితర అనేక సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయకుండా ఇక్కడ పేద ప్రజలకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారనే అక్కసుతోనే ప్రతిపక్షాలు ఇలాంటి చౌకబారు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఇకనైనా ఇలాంటి సంస్కృతిని కట్టిపెట్టి ప్రజలకు మేలుచేసే కార్యక్రమాలకు అడ్డుపడకుండా ఉండాలని హితవు పలికారు. కార్యక్రమంలో యూసుఫ్గూడ కార్పొరేటర్ బి.రాజ్కుమార్ పటేల్, నర్సింగ్దాస్, సంతోష్ ముదిరాజ్, గీతగౌడ్, అరుణ, ఖైసర్, వేణుగోపాల్తో తది నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?