మన్సూరాబాద్, హయత్నగర్ సెప్టెంబర్ 22: వరద ముప్పు సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు కోట్లాది రూపాయలతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో డ్రైనేజీ, వరదనీటి ట్రంకులైన్లు ఏర్పాటు చేస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి నరసింహస్వామి కాలనీ ఫేజ్-2, అనంతుల వీరారెడ్డి కాలనీ, ఆనంద్నగర్లో రూ. 97.70 లక్షలతో యూజీడీ పైపులైన్ ఏర్పాటు పనులకు కార్పొరేటర్ చింతల అరుణతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
మన్సూరాబాద్ డివిజన్ పరిధి శైలజాపూరికాలనీ, సరస్వతినగర్, త్యాగరాయనగర్ కాలనీలలో రూ. 50.19 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న యూజీడీ పైపులైన్ పనులకు కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. నాగోల్, బండ్లగూడ చెరువు ఎగువ, దిగువ కాలనీలకు ముంపు సమస్య తలెత్తకుండా ఉండేందుకు గాను చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. స్టాటర్జిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ) కింద పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. అక్టోబర్లో పనులు ప్రారంభమవుతాయని దీని వలన బండ్లగూడ, నాగోల్ చెరువు, అయ్యప్పకాలనీ, శ్రీనివాసకాలనీల్లో భవిష్యత్తులో ముంపు సమస్య ఉండవని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో నరసింహస్వామి కాలనీ ఫేజ్-2 అధ్యక్షుడు వీవీఎస్ఆర్ మూర్తి, ప్రధాన కార్యదర్శి ఎస్. జీవన్రెడ్డి, కోశాధికారి కె. వెంకట్రెడ్డి, సభ్యులు ఓ. మురళి, ఎన్. సుధాకర్, వై. సురేందర్ రావు, అనంతుల వీరారెడ్డి కాలనీ అధ్యక్షుడు జగదీశ్, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, గిరిధర్, సభ్యులు మధుసూదన్, నాగరాజు, శివాజీరావు, ఇంద్రప్రస్థకాలనీ అధ్యక్షుడు హన్మంతరెడ్డి, సరస్వతినగర్ కాలనీ అధ్యక్షుడు కమాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి. రంగారెడ్డి, కోశాధికారి ప్రదీప్కుమార్, ఉపాధ్యక్షులు మక్సూద్ అలీ, సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి ధర్మారావు, మురళీగౌడ్, చందునాయక్, రామాచారి, విద్యాసాగర్, సుబ్బారావు మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, వివిధ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు సతీశ్యాదవ్, టంగుటూరి నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.
హయత్నగర్ డివిజన్ సౌత్ కాలనీల్లో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారమవుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని ఆయా కాలనీల్లో రూ.కోటి 28 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ.58 లక్షలతో నర్సింహారావునగర్ వద్ద నిలిచిపోయిన ఎస్డబ్ల్యూడీ వరద కాలువను, రూ.15 లక్షలతో హయత్నగర్ నుంచి ఫైర్స్టేషన్, విద్యుత్ సబ్స్టేషన్ మధ్య నుంచి పద్మాతి కాలనీ ఎస్డబ్ల్యూడీ వరద కాలువ లైన్కు లింక్ను, రూ.55 లక్షలతో బంజారా కాలనీ స్లాబ్ కల్వర్టు వద్ద నుంచి అంబేద్కర్ కాలనీ వరకు ట్రంక్ లైన్ను చేపట్టనున్నారని వివరించారు.
దీంతో హయత్నగర్ డివిజన్ పరిధిలోని సౌత్ కాలనీల్లో డ్రైనేజీ సమస్య పరిష్కారం కానున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు గుడాల మల్లేశ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, సింగిరెడ్డి మల్లీశ్వరి, తోగూట లీల, జ్యోతి రెడ్డి, రాజశేఖర్, సుమంత్, లింగం మనోజ్, గూడాల సందీప్ ముదిరాజ్, బాలకృష్ణ యాదవ్, మెగావత్ గోవర్దన్, దేవరాం, కరంటోతు శంకర్, ప్రకాశ్, హరికృష్ణ, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బండారి భాస్కర్, సత్యనారాయణ, పారంద మహేశ్, నర్సింహారావునగర్ కాలనీ అధ్యక్షుడు గోవిందరాజు, ఆయా కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.