వనస్థలిపురం, మార్చి 10 : పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాయత్రి భవన్లో నిర్వహించిన పట్టభద్రుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యావంతురాలైన వాణీదేవిని మండలికి పంపిస్తే విద్యావంతుల సమస్యలపై గళం విప్పుతారన్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు నివాళిగా ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో బేవరేజస్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నంత కృషి మరే ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, మాధవరం నర్సింహారావు, తులసి శ్రీనివాస్, మంగపతిరావు, లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యం, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్, మార్చి 10: విద్యావంతురాలైన సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిశ్రీప్రసాద్ కోరారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా బుధవారం నాగోల్ డివిజన్ పరిధి శ్రీసాయినగర్కాలనీలోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బ్యాలెట్ పేపర్లోని 4వ వరుసలో సురభి వాణీదేవి పేరుకు ఎదురుగా ఒక సంఖ్యను వేసి టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెరుకు ప్రశాంత్గౌడ్, కాలనీ ప్రధాన కార్యదర్శి రమేశ్కుమార్, సభ్యులు యాదగిరి, హన్మంతరావు, మురళి, అశోక్, కృష్ణమూర్తి, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి ప్రగతినగర్, కొలను శివారెడ్డికాలనీ, హిమపురికాలనీల్లో డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రులను కలుసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్యాదవ్, నాయకులు వెంకటాచార్యులు, సంతోష్కుమార్ గుప్తా, రాములు, కాసుల బాలరాజు గౌడ్, పారంద నర్సింగ్రావు, కేకేఎల్ గౌడ్, కె. ఆనంద్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.