టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి ఏ ఆపద వచ్చిన అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. లింగోజిగూడ డివిజన్ శ్రీనివాస్నగర్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ధన్రాజ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సహకారంతో పార్టీ నుంచి మంజూరైన రూ. రెండు లక్షల ప్రమాదబీమా చెక్కును లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావుతో కలిసి ధన్రాజ్ తల్లి రాణికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధితోపాటు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తిలక్రావు పాల్గొన్నారు.