ఎల్బీనగర్, జూలై 26 : తెలంగాణ ప్రభుత్వం అర్హులందరికీ కొత్త రేషన్కార్డులను అందజేస్తున్నదని ఎంఆర్డీసీ చైర్మ న్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. సోమవారం చైతన్యపురి డివిజన్ పరిధిలో ని రామాలయం కల్యాణ మండపంలో లబ్ధిదారులకు నూతన ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ నర్సింహాగుప్తా పాల్గొ ని లబ్ధిదారులందరికీ రేషన్కార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఉప్పల్ డిప్యూటీ తాసీల్దార్ రఫీయుద్దీన్, చైతన్యపురి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, సీనియర్ నాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.