హయత్నగర్, జూలై 18 : గౌడ సంఘం అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషిచేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హామీఇచ్చారు. ఆదివారం హయత్నగర్ డివిజన్ పరిధిలోని గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హయత్నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నం.159లో 16 గుంటల ప్రభుత్వ స్థలాన్ని ఎక్సైజ్ అధికారుల ఆధీనంలో ఉన్నదని, ఆ స్థలాన్ని గౌడ సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి కేటాయించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్తో చర్చించి గౌడ సంఘానికి స్థలం కేటాయించేలా కృషిచేస్తానని, నూతన భవన నిర్మాణానికి రూ.10 లక్షలు నిధులు మంజూరు చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హయత్నగర్, జూలై 18 : డివిజన్ పరిధిలోని శంకర్నగర్ కాలనీలో నూతనంగా డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మించాలని కోరుతూ ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి కాలనీవాసులు వినతిపత్రం ఇచ్చారు. ఆదివారం హయత్నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శంకర్నగర్ కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదని, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ హయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు గుడాల మల్లేశ్ ముదిరాజ్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ప్రదీప్రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.