ఎల్బీనగర్, జూలై 9:ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల జులుంను సహించబోమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి హెచ్చరించారు. శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా డీఈవో సుసీందర్రావు, సరూర్నగర్ ఎంఈఓ కృష్ణతో కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ ఆయా పాఠశాలల వద్ద ఫీజుల వసూలు డిస్ప్లే బోర్డులు పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి ప్రైవేటు పాఠశాలలో పేరెంట్స్ కమిటీ వేయాలన్నారు.అనంతరం రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుసీందర్ రావు మాట్లాడుతూ పాఠశాలన్నింటికీ ఫీజుల నిబంధనలతో ప్రొసీడింగ్స్ ఇచ్చామన్నారు. ఆన్లైన్ క్లాసులు లింక్ ఇవ్వకుండా వేధించే పాఠశాలలపై తమకు లిఖిత పూర్వకంగా కానీ, సెల్నంబర్ 7995087 604కు గాని సమాచారం ఇవ్వాలని డీఈవో కోరారు.