మన్సూరాబాద్, జూన్ 25: ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. వీరన్నగుట్టకాలనీలోని బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకాలపై ఎలాంటి అపోహలు అవసరంలేదని తెలిపారు. కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. హయత్నగర్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, మహిళా అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి, నాయకులు పోచబోయిన జగదీశ్యాదవ్, మల్లీశ్వరి, కేకేఎల్ గౌడ్, ఆనంద్యాదవ్, పారంద నర్సింగ్రావు, యంజాల సురేశ్, పారంద సాయి, యంజాల జగన్, పాతూరి శ్రీధర్గౌడ్, శేఖర్యాదవ్ పాల్గొన్నారు.