ఎల్బీనగర్, జూన్ 23: ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని చంపాపేట డివిజన్లో రూ. 2.06 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సుధీర్రెడ్డి,కార్పొరేటర్ మధుసూదన్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. వర్షాకాలం దృష్ట్యా ఎక్కడెక్కడ ఓపెన్ నాలాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిపై కప్పులు వేయిస్తామన్నారు. కార్యక్రమంలో చంపాపేట డివిజన్ సీనియర్ నాయకులు రఘుమారెడ్డి, మధుసూదన్రెడ్డి, కృష్ణమాచారి, రవీందర్రెడ్డి, రమేశ్గౌడ్, సందీప్రెడ్డి, రాజారెడ్డి, గోపాల్, అనసూయ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
వనస్థలిపురం: వనస్థలిపురం డివిజన్ గుంటి జంగయ్యకాలనీలో చేపట్టిన బాక్స్డ్రైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే సుధీర్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలాన్ని దృష్టి లో పెట్టుకొని పనులు చేపట్టడం జరుగుతున్నదన్నారు. దీంతో పాటు ఓపెన్ నాలాలను విస్తరించి, వాటిపై స్లాబులు వేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డి, రవికుమార్, శ్రీధర్గౌడ్, వేములయ్యగౌడ్, ఖైసర్, మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.