ఎల్బీనగర్, జూన్ 3: నిత్య సేవకులందరికీ టీకా వేయించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్ సర్కిల్లోని చంపాపేట మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ టీకా కేంద్రాలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఉప కమిషనర్ సురేందర్రెడ్డి, నాయకులు నల్ల రఘుమారెడ్డితో పాటుగా పలువురు పాల్గొన్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అరికట్టే క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ల పాత్ర అమోఘమని, కరోనా సమయంలో వారి సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కొనియాడారు. బుధవారం ఎల్బీనగర్లో పలువురు పోలీస్ అధికారులు, అంబులెన్స్ డ్రైవర్లతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. డ్రైవర్లు కరోనా సమయంలో కూడా మానవత్వాన్ని చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఎల్బీనగర్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీధర్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు నాగమల్లు, అశోక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.