మన్సూరాబాద్, ఏప్రిల్ 28: బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గడంతో ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. బుధవారం నాగోల్ డివిజన్ పరిధి బండ్లగూడలోని పీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో ఎన్ఎంజీ వైద్యశాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 150 మంది ఈ శిబిరానికి హాజరై రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ రక్తదానంతో ఎందరో ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. కరోనా వచ్చిన వారితో పాటు వ్యాక్సిన్ వేయించుకున్న వారు 28 రోజుల వరకు రక్తదానం చేసే అవకాశం లేకపోవడంతో బ్లడ్ బ్యాంకుల్లో కొరత ఏర్పడిందని తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలన్నారు. రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, మాజీ కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్ రెడ్డి, సాగర్రెడ్డి, నాయకులు అనంతుల రాజిరెడ్డి, రఘుమారెడ్డి, తూర్పాటి చిరంజీవి, కైసర్, దీప్లాల్, భాస్కర్యాదవ్, చంద్రశేఖర్రెడ్డి, రవి ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, రవిచారి, జహంగీర్బాబు గౌడ్, డాక్టర్ లోకభరణి, సిబ్బంది స్వర్ణలత, సుహాసిని పాల్గొన్నారు.