మన్సూరాబాద్, సెప్టెంబర్ 26: అనాథ విద్యార్థులకు సమాజంలోని మంచి చెడుల పట్ల అవగాహన కల్పించేందుకు యువత ముందుకు రావడం ఎంతో అభినందనీయమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్లోని హరిణ వనస్థలి నేషనల్ పార్కులో ఆదివారం రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మాధవరం నర్సింహారావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది అనాథ విద్యార్థులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి చేతులమీదుగా వన భోజనాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనాథ విద్యార్థులకు క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం ద్వారా వారు మానసికంగా ఎంతో బలపడుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామ బుచ్చిరెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి, బత్తుల నాగార్జున గౌడ్, గొరిగె ప్రదీప్, రమేశ్, నర్ర ప్రశాంత్రెడ్డి, శ్రీకాంత్, వినోద్, గౌతమ్, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.