కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హస్తినాపురం ఆదర్శ్నగర్కు చెందిన లారీడ్రైవర్ భాస్కర్ గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన టీఆర్ఎస్ పార్టీ సభ్యుడు కావడంతో రూ.2లక్షల ప్రమాద బీమా మంజూరైంది. ఆ చెక్కును మృతుడి భార్య లలితకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పక్షాన కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు పార్టీ అధినాయకత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. కార్యక్రమంలో మహేశ్రెడ్డి, జితేందర్ నాయక్, భీంలాల్, బాల నాయక్, ధరం సింగ్ పాల్గొన్నారు.