శ్రీనగర్కాలనీ, జూలై 30 : పేదల అభ్యున్నతే ప్ర భుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ -9లోని రాయల్ గార్డెన్లో వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 106 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ఈ కార్డుతో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్తోపాటు పలు పథకాల లబ్ధికి, వైద్యసేవలు పొందేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి పేదకుటుంబానికి ఆహారం, సంక్షేమం, అభివృద్ధి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. రజకులు, నాయీబ్రహ్మణులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్పొరేటర్ కవితారెడ్డి మాట్లాడుతూ అర్హులైన దరఖాస్తుదారులకు ఆహార భద్రత కార్డులు అందేలా చొరవ చూపుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్-7 ఏఎస్వో ఇర్ఫాన్హుస్సేన్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సారంగపాణి, జావీద్, అరుణ్, ప్రేమ్వైరల్, రాజు తదితరులు పాల్గొన్నారు.