బంజారాహిల్స్,జూలై 23: ఖైరతాబాద్ నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పౌరసరఫరాల సర్కిల్-7 అధికారులతో కొత్త రేషన్ కార్డుల జారీపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సమీక్ష నిర్వహించారు. సర్కిల్ -7 పరిధిలో తమకు 10,751 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 3,608 మంది అర్హులుగా తేలారని సర్కిల్-7 ఏఎస్వో ఇర్ఫాన్ అహ్మద్ తెలిపారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదలు అధికంగా నివాసముంటున్నారన్నారు. ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుతానని, కొత్త దరఖాస్తులను కూడా తీసుకునేలా చూస్తానన్నారు. అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.