ఖైరతాబాద్, జూలై 4: సోమాజిగూడ డివిజన్లోని కీర్తిలాల్ లేన్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ వనం సంగీత, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె.ప్రసన్న మొక్కలు నాటారు. బీఎస్ మక్తాలోని రచ్చబండ స్థలంలో మొక్కలు నాటడంతో పాటు బస్తీవాసులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్కిల్ 17 డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, డీఈ చైతన్య, ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్నారాయణ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎస్కె అహ్మద్, మాజీ కార్పొరేటర్ లక్ష్మినారాయణమ్మ, నాయకులు వనం శ్రీనివాస్యాదవ్, సలావుద్దీన్, నాగరాజు, కె.రామ్మూర్తి పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం. ప్రధానంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతికాలనీ, బస్తీల్లో ఉదయం నుంచి సాయం త్రం వరకు పారిశుధ్య పనులను నిర్వహిస్తూ స్ఫూర్తిని చాటుతున్నారు. ఈ నేపథ్యంలో సోమాజిగూడలో చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పలువు రు పారిశుధ్య కార్మికులను ప్రశంసించారు. వారికి మొక్కలను అందజేసి, సేవలను కొనియాడారు.
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ డివిజన్ గాయత్రీ హిల్స్ లో ఆదివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మొక్కలు నాటారు. డీఎంసీ ఇస్లావత్ సేవానాయక్, ఏ ఎంఓహెచ్ డా.రవికాంత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖైరతాబాద్ డివిజన్లోని గాంధీ తాతానగర్లో కాలనీవాసులంతా మొక్కలు నాటారు. స్థానిక కార్పొరేటర్ పి.విజయారెడ్డి మొక్కలు పంపిణీ చేశారు. కాలనీవాసులందరూ మొక్కలు నాటేందుకు ఉత్సాహంగా రావ డం అభినందనీయమని కార్పొరేటర్ అన్నారు.
షేక్పేట్: పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోరారు. ఆది వారం షేక్పేట్ డివిజన్ ఓయూకాలనీలో మొక్కలు నాటారు. అనంతరం రూ.63 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీసీరోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్ సేవానాయక్, డీఈ హరేరాం, టీఆర్ఎస్ షేక్పేట్ డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్, బాలకృష్ణ, సజ్జాద్, షకీల్, శివస రాము, మధుసూదన్ పాల్గొన్నారు.
వెంగళరావునగర్, మధురానగర్, జవహర్నగర్, యాదగిరినగర్లలో వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య పర్యటించారు. ఈ సందర్భంగగా పేరుకుపోయిన చెత్తకుప్పలను సిబ్బంది తొలగించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ వ్యర్థాలను తొలగించడంతో పాటు మొక్క లు నాటుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వెంగళరావునగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
శ్రీనగర్కాలనీ: నూర్నగర్లోని రాఘవ సొసైటీ పార్కులో మొక్కలు నాటారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం బస్తీవాసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది వ్యర్థాలను తొలగించారు. కార్యక్రమంలో ఏఈ ఆనంద్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రేమ్కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజయ్య, ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్: సమస్యలకు సత్వర పరిష్కారం చూపెడుతున్నామని కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్ తెలిపారు. యూసుఫ్గూడలో పారిశుధ్య పనులు, దోమల నివారణ చర్యలు చేట్టారు. కార్పొరేటర్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది పాల్గొని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. యూసుఫ్గూడ డివిజన్లోని కృష్ణానగర్, హైలంకాలనీ, కమలాపురికాలనీ ప్రాంతాల్లో చురుకుగా పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్, పిచికారీ చేపట్టామన్నా రు. టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.