బంజారాహిల్స్,సెప్టెంబర్ 2 : బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీ రిక్రియేషన్ సెంటర్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్లపాటు కొనసాగే కమిటీ అధ్యక్షుడిగా ఎం.రాజమహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా జి.ప్రభాకర్రెడ్డి, కార్యదర్శిగా వైవై.రెడ్డి, జాయింట్ సంయుక్త కార్యదర్శిగా కేఆర్ఎన్.రెడ్డి. కోశాధికారిగా పి.నారాయణరెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
వీరితో పాటు పాలకమండలి సభ్యులుగా కే.చక్రధర్రెడ్డి, ఏ.మధుసూధన్రెడ్డి, ముకుంద్ లాల్ బహేతి, ఆనం శ్రీకర్, పి.వేణుగోపాల్రెడ్డి, జి.జయప్రధారెడ్డి, కే. లక్ష్మిరెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి, ఉపేందర్రెడ్డిలు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న సభ్యులకు అత్యుత్తమ సేవలు అందించడంతో పాటు వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని అధ్యక్షుడు రాజమహేందర్రెడ్డి తెలిపారు.