ఉప్పల్, జూలై 31 : ప్రభుత్వ విద్యాసంస్థల ఏర్పాటుతో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. విద్య, వైద్యరంగం పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఉప్పల్ నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ శనివారం హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే, పలువురు నేతలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జై కేసీఆర్, జై బీఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టి, బాణాసంచా కాల్చి సంబురాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ప్రజల కోసం పనిచేసేది టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నామని తెలిపారు. కొన్ని ఏండ్లుగా ఉప్పల్కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాకపోవడంతో ఎంతో ఇబ్బంది పడ్డారని చెప్పారు. విద్యార్థుల కలను నిజం చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్న్స నాగేశ్వర్రావు, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, సాయిజెన్ శేఖర్, గంధం నాగేశ్వర్రావు, వేముల సంతోశ్రెడ్డి, గాయం శ్రీధర్రెడ్డి, గరిక సుధాకర్, కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, పల్లా కిరణ్కుమార్రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, డప్పు గిరిబాబు, సత్యనారాయణ, శ్రీధర్, శంకర్, జేసీబీ రాజు, జీనత్బేగం, శ్రవణ్, అద్వైత్ తదితరులు పాల్గొన్నారు.