ఉప్పల్, జూలై 23 : వరదనీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించి.. వరదనీరు చేరిన ప్రాంతాలను పరిశీలించారు. కావేరినగర్, వెంకటేశ్వర టెంపుల్ రోడ్డులోని స్వరూప్నగర్ కల్వర్టులను ఎమ్మెల్యే పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్వర్టు పనులు ఇప్పటివరకు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్లిస్ట్లో పెట్టాలని సూచించారు. అదేవిధంగా నల్లచెరువు కట్ట అవుట్లెట్ను పరిశీలించి, నీటి ప్రవాహానికి అడ్డుగా చెత్త చేరకుండా చూడాలని తెలిపారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, డీఈ నిఖిల్రెడ్డి, ఏఈ వసంత, సీనియర్ నాయకులు జనుంపల్లి వెంక టేశ్వర్రెడ్డి, లేతాకుల రఘుపతిరెడ్డి, చిలుకానగర్ డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, చింతల నర్సింహారెడ్డి, పల్లె నర్సింగ్రావు, ఏదుల్ల కొండల్రెడ్డి, టంటం వీరేశ్, ప్రవీణ్కుమార్, అన్య వెంకటేశ్, సత్యపాల్రెడ్డి, వేముల వెంకట్రెడ్డి, గొరిగె ఐలేశ్, చిలుగూరి శ్రీకాంత్, సాయిరాజ్రె డ్డి, భరత్,తదితరులు పాల్గొన్నారు.
కల్వర్టుల వద్ద ప్రతిపక్ష పార్టీల డ్రామాలు మానుకోవాలని చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ అన్నారు. నాలా కల్వర్టుల వద్ద వర్షాల కారణంగా పనులు ప్రారంభించలేదని, వీటిపై ప్రతిపక్షపార్టీల నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం పర్యటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా చవకబారు రాజకీయాలు మానుకొని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.