రామంతాపూర్, జూలై 22 : రామంతాపూర్ పెద్దచెరువు అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఈ చెరువులో గుర్రపుడెక్క పెరిగిపోగా దానిని తొలగించే పనులను గురువారం చేపట్టారు. ఈ మేరకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జేసీబీ ద్వారా గుర్రపు డెక్కను తొలగించే పనులను వేగవంతం చేస్తున్నామన్నారు.
చెరువులో వరదనీరు ఉండకుండా ఎప్పటికప్పుడు మోటర్ల ద్వారా తొలగిస్తున్నామని అన్నారు. వర్షాలు ఎక్కువగా పడుతుండటంతో పైనుంచి వరదనీరు వస్తుందని.. ఆ నీరును మోటర్ల ద్వారా ఎప్పటికప్పుడు బయటకు పంపుతున్నామని తెలిపారు. ఈ చెరువును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజిస్టు రజనీ, స్థానిక కాలనీవాసులు వెల్లంకి రవీందర్రెడ్డి, పి.నగేశ్, జయచంద్రారెడ్డి, మల్లయ్య, హనుమంతు, టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, ఆకుల ప్రభాకర్, శివ, జేసీబీ రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.